హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదలచేసింది. ఈ మేరకు గురువా రం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీచేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వడ్డీలేని రుణా ల కోసం ప్రభుత్వం రూ.1,698 కోట్లు కేటాయించింది. తొలివిడతలో భాగంగా రూ.200 కోట్లు విడుదలచేసింది. మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాల వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఆ మొత్తం ప్రభుత్వం చెల్లించిన తర్వాత మినహాయించుకొన్న వడ్డీమొత్తాన్ని మళ్లీ సంఘాలకు బ్యాంకులు చెల్లిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా వడ్డీ లేని రుణాలకు నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్కు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధన్యవాదాలు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తున్నదని, సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలను అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మహిళా శక్తి ప్రాధాన్యతను గుర్తించి సీఎం కేసీఆర్ వారికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని మంత్రి దయాకర్రావు తెలిపారు.