హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్రముఖ న్యాయవాది తంగిరాల హన్మంతరెడ్డి కుమారుడి వివాహం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తదితరులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుక సందర్భంగా మంత్రి ఎర్రబెల్లితో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్గా సతీశ్ చంద్ర ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.