హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ ప్రాంగణంలో కొత్త మసీదు నిర్మాణ పనులు ఈ నెలలో ప్రారంభించనున్నారు. 9 నెలల్లో నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. మార్చి 2022 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆదివారం సచివాలయ ప్రాంగణంలో నిర్మించే మసీదు నమూనాలను హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహదారు ఏకే ఖాన్ పరిశీలించారు. ఏకకాలంలో 400 మంది ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదును నిర్మిస్తున్నారు.