మొయినాబాద్, సెప్టెంబర్ 12: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంగళవారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కోట్ల మొక్కలను నాటిందని తెలిపారు. ఎనిమిదేండ్ల క్రితం నాటిన మొక్కలు నేడు మహా వృక్షాలుగా మారాయమని తెలిపారు. అకాడమీలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటి గ్రీనరీ పెంచుకోవాలని అధికారులకు సూచించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి ప్రజలు, ప్రముఖుల మద్దతు పెరుగుతున్నదని, అనేక మంది భాగస్వాములై మొక్కలు నాటుతున్నారని వివరించారు. కార్యక్రమంలో ఐపీఎస్లు అనిల్కుమార్, ఇక్బాల్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.