ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ ఆనంద్ ఈ రోజు తెల్లవారుఝామున చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించారని తొలుత వార్తలు వచ్చాయి. కాని ఆయన మరణానికి కరోనా కూడా కారణం అని తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం కేవీ ఆనంద్ కుటుంబ సభ్యులకు కరోనా రావడంతో వారి నుండి ఆనంద్కు కరోనా సోకిందట. దాంతో ఆయన శ్వాస ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరారు. కొద్ది సమయానికి గుండె పోటు రావడంతో మరణించారని తెలుస్తుంది.
కేవీ ఆనంద్ కరోనాతో మరణించడంతో ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు ఆసుపత్రి వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. నటుడు సూర్య మృతదేహాన్ని ఆసుపత్రి నుండి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆయన దేహాన్ని బయటకు పంపడం కుదరని హాస్పిటల్ వారు తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం ఆనంద్ మృతదేహాన్ని నగర్ ఎలక్ట్రికల్ అంత్యక్రియశాలకు పంపిస్తామని అంటున్నారు. తమ అభిమాన దర్శకుడిని చివరి చూపు చూసుకోలేకపోతున్నందుకు అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..