న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణతో పరీక్షల వాయిదా పరంపర కొనసాగుతున్నది. ప్రముఖ విద్యాసంస్థ అయిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలాని పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఎంట్రెన్స్ టెస్ట్ జూన్ 24 నుంచి 29 వరకు జరగాల్సి ఉన్నాయి. పరీక్షలను జూలై-ఆగస్టు నెలల్లో నిర్వహించే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరీక్ష అప్లికేషన్ గడువును ఈనెల 30 వరకు పొడిగించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా పిలాని, గోవా, హైదరాబాద్లోని బిట్స్ క్యాంపస్లలో బ్యాచిలర్ కోర్సుల్లో అడ్మిషన్స్ కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు: అబ్బాయిలకు రూ.3400, అమ్మాయిలకు రూ.2900
వెబ్సైట్: bitsadmission.com
దేశంలోని 22 ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) వాయిదా పడింది. ఈ మేరకు వర్సిటీల కన్సార్షియం ప్రకటించింది. పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును జూన్ 15 వరకు పొడిగించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి