హైదరాబాద్: తరచుగా వినూత్న ఆవిష్కరణ లు జరిపిన వ్యక్తులను మెచ్చుకునేందుకు సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకునే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈసారి ఓ నవ్వు పుట్టించే అంశాన్ని సరదాగా షేర్ చేసుకున్నారు. అసలే ఇవి కరోనా రోజులు. సామాజిక దూరం తప్పనిసరి అయింది. కానీ ఇద్దరు వ్యక్తులు మరోరకం సామాజిక దూీరాన్ని పాటించారని, అది చాలా ప్రమాదకరమైందని మహీంద్ర పేర్కొన్నారు. నిచ్చెనను తమ మెడలకు వేసుకుని రెండు బైకులపై వెళ్లే ఇద్దరు వ్యక్తులున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. ఈ కరోనా కల్లోలంలోనూ ఈ ఫొటో తనకు నవ్వు తెప్పించిందని ఆయన పేర్కొన్నారు.