ఆలేరు టౌన్, ఏప్రిల్ 7: ఇక నుంచి గ్రామ పంచాయతీల్లో పనులు వేగవంతం కానున్నాయి. గ్రామాల అభివృద్ధిలో నిధుల ఖర్చుపై పూర్తి హక్కులు గ్రామపంచాయతీలకే కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. నిధుల పరిమితికి సంబంధించి గతంలో జారీ చేసిన జీవోనెంబర్ 91ని రద్దు చేసింది. దీని స్థానంలో గ్రామ పంచాయతీలకు(జీపీలకు) అధికారాన్ని కల్పిస్తూ జీవోనెంబర్ 18ని తీసుకొచ్చారు. ఈ జీవో ఆధారంగా పంచాయతీలకు నిధు ల వినియోగంపై గ్రామసభలు నిర్వహించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. గతంలో నిధులు ఉన్నప్పటికీ ఖర్చు చేయాలంటే అనే క అడ్డంకులు ఉండేవి. డీఎల్పీవో, కలెక్టర్ అనుమతి రావడానికి సమయం పట్టేది. ఎవరైనా పనులపై చిన్న అభ్యంతరాలు తెలిపి నా నిలిపేసేవారు. నూతన జీవోతో సర్పంచ్లకు పూర్తి అధికారం చేతుల్లోకి రానుంది. నిధులు ఖర్చు చేసే విషయంలో పాలకవర్గానికే అధికారాన్ని కట్టబెడుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు. జి ల్లాలో 421 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కొత్త జీవోతో సమస్యలు సత్వరమే పరిష్కారం కానున్నాయి. జీవో ద్వారా నేరుగా నిధులు అభివృద్ధి పనులకు ఖర్చు చేయవచ్చు.
ఇందులో నీటి ఎద్దడి నివారణ, పల్లె ప్రగతి పనులు, రోడ్ల మరమ్మతులు త్వరగా చేపట్టవచ్చు. పాత జీవో ప్రకారం ఆయా పంచాయతీల్లో సివిల్ పనుల కోసం మేజర్ గ్రామపంచాయతీలు అయితే రూ. 2లక్షలు, చిన్న గ్రామపంచాయతీలకు రూ. లక్ష ఖర్చు చేసుకునేందుకు అనుమతి ఉండేది. రూ.3లక్షల వరకు అయితే డీపీవో, అంతకుమించి అయితే కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉండేది. దీంతో అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతున్నదని గుర్తించిన తెలంగాణ సర్కార్ జీపీలకు వెసులుబాటు కల్పించింది. ఈ జీవో ద్వారా గ్రామపంచాయతీల్లో ఉన్న వార్డు సభ్యుల మధ్య సమన్వయం ఉంటే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఈ జీవో ద్వారా గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన జరుగుతాయని సర్పంచ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్కు వారు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఇవీ కూడా చదవండీ…
22వేలకే HP క్రోమ్బుక్..16 గంటల బ్యాటరీ లైఫ్, మరెన్నో ఫీచర్లు!
భారత సైన్యం మానవత్వం.. స్వదేశానికి పాకిస్థానీ యువకుడు.. వీడియో
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
ప్రముఖ కన్నడ నటి ప్రతిమా దేవి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం