హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): నీటి పారుదల ప్రాజెక్టుల భూ నిర్వాసితుల కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగాలు కల్పించేందుకు జిల్లా కమిటీలు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ ఉత్వరులు జారీ చేశారు. ఈ కమిటీలకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జాయింట్ కలెక్టర్, టెరిటోరియల్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సభ్యులుగా, సంబంధిత ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.