పరిగి, మార్చి 30 : ప్రతి సందర్భంలోనూ రైతాంగానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడానికే గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను సర్కారు ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. మంగళవారం పరిగిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పంటలు సాగు చేపట్టినప్పటి నుంచి అనేక రకాలుగా సర్కారు అండగా నిలుస్తున్నదన్నారు. పంటలకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాదికి రూ.10వేలు, సబ్సిడీపై విత్తనాలు, యంత్ర పరికరాలు అందజేస్తున్నదని చెప్పారు. రైతులు పండించిన పంటలు సైతం కొనుగోలు చేస్తున్నది దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువచ్చి మంచి ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు.
కరోనా విజృంభిస్తున్నందున మార్కెట్కు ఒక్కసారిగా వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువస్తే తలెత్తే ఇబ్బందులను అధిగమించడం, రైతుల వద్ద ఎక్కడికక్కడే కొనుగోలుతో ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. శనగల కొనుగోలు కేంద్రంలో పరిగి, పూడూరు రెండు మండలాల రైతులు తాము పండించిన శనగలను విక్రయించవచ్చని చెప్పారు. అత్యంత పారదర్శకంగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్, మాజీ జడ్పీటీసీ బాబయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, సురేందర్కుమార్, ఏడీఏ వీరప్ప, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సర్పంచ్లు మధుసూదన్రెడ్డి, గణేశ్, పీఏసీఎస్ సీఈవో అమరేందర్రెడ్డి పాల్గొన్నారు.