ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఉద్యోగులతో తమది పేగు బంధం. ఉద్యోగుల పక్షపాతంగా పనిచేస్తుందన్నారు. వాణీదేవికి ప్రథమ ప్రాధాన్య ఓటు వేయాలి.
– ప్రశాంత్రెడ్డి, ఆర్అండ్బీశాఖ మంత్రి
దేశంలో ఏం జరుగుతుందో విజ్ఞులైన పట్టభద్రులు, ప్రజలు ఆలోచించాలి. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను హోల్సేల్గా అమ్మేస్తున్నారు. దేశంలో కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలను సర్దుబాటుచేసుకొనేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజలపై కేంద్రం భారం మోపుతున్నది. ఆలోచించి టీఆర్ఎస్కే ఓటేయాలి.
– నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని ఆశీర్వదించండి. పనిచేసే వారికి మద్దతు ఇచ్చి గెలిపిస్తే మరింత ఉత్సాహంగా పనిచేసి సమస్యలు పరిష్కరించే ఆవకాశం ఉంటుంది. ఏడేండ్లలో పాలమూరు జిల్లాలో మెడికల్ కళాశాల, కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, బైపాస్ రోడ్డు, ట్యాంక్ బండ్ రావడంతో ఎంతో అభివృద్ధి చెందింది.
– శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్శాఖ మంత్రి
ఎమ్మెల్సీగా వాణీదేవిని గెలిపించి టీఆర్ఎస్ సత్తా చాటాలి. మచ్చలేని ఉన్నవిద్యావంతురాలు వాణీదేవికి పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి పట్టభద్రులు ఓటువేయాలి. తెలంగాణ ప్రగతిని పట్టని బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి.
– ప్రతాప్రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్
అన్నిరంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కులేదు. గిరిజన విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభు త్వం స్థలం చూపినా గిరిజనుల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని గాలికి వదిలేసి, కోచ్ఫ్యాక్టరీ ఊసే లేకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను పట్టభద్రులు గమనించి బీజేపీకి గుణపాఠం చెప్పాలి.
– ప్రొఫెసర్ సీతారాంనాయక్, మాజీ ఎంపీ