మంత్రి హరీశ్రావుకు ట్రస్మా నేతల వినతి
జమ్మికుంట, ఆగస్టు 7: ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన ఆపతాల సాయాన్ని విడుదల చేయించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు కోరారు. శనివారం హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఎదురొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా శేఖర్రావు మాట్లాడుతూ.. దేశంలోనే ప్రథమంగా ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది ఎదురొంటున్న కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్.. ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతి నెలా రూ.2 వేలు, 25 కిలోల బియ్యాన్ని ప్రత్యేక సాయంగా అందించడం గొప్ప విషయమన్నారు. అయితే జూలై నుంచి రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఇంకా అందని కారణంగా ఉపాధ్యాయులు, సిబ్బంది ఆర్థిక, మానసిక క్షోభకు గురవుతున్నారని, వెంటనే జూలై, ఆగస్టు కోటాను విడుదల చేయించాలని కోరారు. విద్యా సంస్థలు తిరిగి తెరుచుకునేదాకా ఈ సహాయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే ఆర్థిక సాయం విడుదలయ్యేలా చూస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో ట్రస్మా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోరం సంజీవరెడ్డి, సామ ప్రతాపరెడ్డి తదితరులు ఉన్నారు.