బెంగళూరు,మే1: గూగుల్ సంస్థకు కరోనా కలిసి వచ్చింది. సంవత్సరంలో 7,400 కోట్ల రూపాయలు ఆదా చేసింది. గూగుల్ సంస్థతమ ఉద్యోగులకు ఆహారం, వినోదం వంటి సౌకర్యాలు అందించడానికి కోట్లాది రూపాయలుఖర్చు చేస్తుంటుంది. అయితే తమ ఎంప్లాయిస్ ఇంటి నుంచి పని చేయడంతో ఈ అలవెన్సులు ఇప్పుడు ఉద్యోగులకు ఇవ్వలేదు. కాబట్టి కంపెనీకి ఆ డబ్బు మిగిలింది.కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ట్రెండ్ పెరిగింది. దీనివల్ల ఆయా సంస్థలకు ఉద్యోగుల ఖర్చు భారీగా తగ్గింది. భారతీయ కంపెనీలతో సహా ప్రపంచంలోని అన్ని పెద్ద కంపెనీలు మునుపటి కంటే ఆపరేషనల్ ఫ్రంట్ కోసం తక్కువ ఖర్చు చేయాలి.టెక్నాలజీ దిగ్గజ సంస్థ గూగుల్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం వల్ల గత ఏడాదిలో రూ .7,400 కోట్ల మేర ఆదా అయింది.
ప్రచార ఖర్చులు 2020 సంవత్సరంలో 41.4 బిలియన్లు తగ్గాయి. కరోనా సమయంలో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ కంపెనీ ఖర్చులను తగ్గించింది, ప్రచారాన్ని ఆపివేసింది.ముఖ్యంగా డిజిటల్ మోడ్ క్యాంపెయిన్ చేసింది. ఈ కారణంగా ప్రయాణ,వినోద ఖర్చులు రూ.371 మిలియన్ల మేర తగ్గాయి.
అయితే ఈ ఏడాది చివర్లో గూగుల్ మళ్ళీ ఆఫీస్ నుంచే పనిచేయించాలని యోచిస్తోంది. పెట్టుబడిదారులకు సంస్థ ‘హైబ్రిడ్’ మోడల్ను ప్లాన్ చేస్తున్నదని,మునుపటి కంటే తక్కువ మంది ఉద్యోగులున్నారని గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ తెలిపారు.