సింగపూర్: వ్యాధి తీవ్రతను బట్టే శరీరంలోని ప్రతిరక్షకాల (యాంటీబాడీలు) మనుగడ ఆధారపడి ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంది. కరోనా వైరస్పై పోరాడే ప్రతిరక్షకాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయని, కొందరిలో యాంటీబాడీలు రోజుల వ్యవధిలో క్షీణిస్తే, ఇంకొందరిలో దశాబ్దాలపాటు కొనసాగుతాయని వెల్లడించింది. కొవిడ్-19 తీవ్రత.. ప్రతిరక్షకాల మనుగడను నిర్ణయిస్తుందని, వ్యాధి తీవ్రత ఎక్కువైతే.. యాంటీబాడీలు నశించి.. ఆ వ్యక్తికి మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉండవచ్చని సింగపూర్లోని డ్యూక్-నస్ మెడికల్ స్కూల్ పరిశోధకుల అధ్యయనం తెలిపింది. ఈ వివరాలు వైద్య పత్రిక ‘లాన్సెట్ మైక్రోబ్’లో ప్రచురితమయ్యాయి.