హైదరాబాద్ : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో విద్యుత్ ఉద్యోగులు విధిగా పాల్గొనాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం పంటలతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ లకు అవసరమయ్యే విద్యుత్ పై సోమవారం సాయంత్రం మింట్ కాంపౌండ్ లోని తన ఛాంబర్లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. వానాకాలంలో విద్యుత్ సిబ్బంది, ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ప్రత్యేక సూచనలు చేశారు. వ్యవసాయ అవసరాలకు కావాల్సిన విద్యుత్ కనెక్షన్లు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వేలాడుతున్న తీగలను సత్వరమే తొలగించాలని పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞాపనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, టీ ఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం