కురవి: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలో కరోనాతో ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. కరోనా సోకి గ్రామానికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయులు ముత్యాల ఆనందం(85) ఖమ్మం దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం ఆయన సతీమణి కూడా సరోజనమ్మ(77) కొవిడ్తో మరణించారు. ఒక్కరోజు వ్యవధిలోనే భార్యా భర్తలు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.