ఇల్లందకుంట, మే 9: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో ఆయన మాట్లాడారు. బీసీల ముసుగులో ఆయా వర్గాలను మోసం చేయడం తగదని, రెడ్డి పేరు చెప్పుకొని బీసీలకు అన్యాయం చేయవద్దని హితవుపలికారు. మంత్రిగా పనిచేసిన నీకు ప్రభుత్వ అసైన్డ్ భూములను కొనుగోలు చేయవద్దని తెలియదా అని ప్రశ్నించారు. చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన వారికి శిక్ష తప్పదని, ఆస్తుల మీద విచారణ చేయమని చెప్పినది కూడా ఈటలనేనని గుర్తుచేశారు.