జోగులాంబ గద్వాల : గద్వాల పురపాలక సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పురపాలక సంఘం పరిధిలో ఈద్గా దగ్గర రూ. 29 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో గద్వాల పురపాలక అభివృద్ధికి పుష్కలంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇప్పటికే మున్సిపాలిటీలో పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైనేజీ పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. ఎమ్మెల్యే వెంట పురపాలక చైర్మన్ కేశవ్. కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం
కరోనాపై ఆందోళన వద్దు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి