పాపన్నపేట/మెదక్ : జిల్లాలోని ఏడుపాయల వనదుర్గభవాని మాత సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. లాక్డౌన్ అనంతరం ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గత రెండు నెలలుగా రెండో దశ కరోనా విస్తరించడంతో పాటు లాక్డౌన్ విధించడంతో భక్తులు రాక ఏడుపాయల బోసిపోయి కనిపించింది. ఇటీవల లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం ఆదివారం పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులు కరోనా జాగ్రత్తలు పాటించేలా తగు చర్యలు చేపట్టారు.
రైతు అవతారం ఎత్తి.. విత్తనాలు చల్లిన మంత్రి హరీశ్ రావు
కథలాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ