హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) ఔషధాల కొనుగోలు కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన అక్రమ సంపాదనను దారి మళ్లించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఇండ్లపై ఈడీ అధికారులు శనివారం హైదరాబాద్లో పలుచోట్ల దాడులు నిర్వహించినట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణితోపాటు ముకుందారెడ్డి తదితరుల నివాసాల్లో సోదాలు చేసి పలు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది.