వనపర్తి : గొర్రెల పంపిణీతో యాదవులకు ఆర్థిక స్థిరత్వం వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా గొర్రెల కాపరుల సంఘం పాలకవర్గంతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉపాధి అవకాశాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఏ రంగంలో ఉపాధి ప్రజలకు లభిస్తుందో ఆ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందుకు అవసరమైన చేయూతను అందిస్తుందన్నారు.
ఉచిత చేప పిల్లల పంపిణీతో గ్రామాలలో మత్స్యకారులకు ఉపాధితో పాటు ప్రజలకు అందుబాటులో పౌష్టికాహారం లభిస్తుందన్నారు. రెండో విడత గొర్రెల పంపకంలో గొర్రె కాపరుల సంఘం పాలకవర్గం ప్రత్యక్ష్యంగా పాల్గొని శ్రద్ధ తీసుకోవాలన్నారు.
వనపర్తి పట్టణంలో మిగిలిపోయిన రెండు సొసైటీల సభ్యులకు గొర్రెల పంపిణీని ఈ విడతలో చేపడుతామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎన్సీడీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ) నిధుల కోసం కేంద్రమంత్రిని కలుస్తామని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ