హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, సీపీఐ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘం అనర్హత వేటువేసింది. 2019 ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన బలరాంనాయక్ తన ఖర్చుల లెక్కలను నిర్ణీత వ్యవధిలో ఎన్నికల సంఘానికి సమర్పించలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై అనర్హత వేటు వేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ విడుదల చేశారు. బలరాంనాయక్ మూడేండ్ల పాటు పార్లమెంటు ఉభయసభలకు, శాసనసభకు, శాసనమండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయినట్టు ఈసీ తెలిపింది.