మంత్రి గంగుల కమలాకర్ ఆరోపణ
హుజూరాబాద్ టౌన్, జూలై 18: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి తప్పదనే భయంతోనే ఈటల రాజేందర్ ఓట్లను కొనుగోలు చేస్తున్నాడని బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. గోడ గడియారాలు, కుట్టు మెషిన్లు పంపిణీ చేస్తూ ప్రజలను ప్రలోభపెడుతున్నాడని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కన్నెబోయిన వంశీ, ఎన్ఎస్యూఐ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వంశీయాదవ్, ప్రశాంత్యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు బొబ్బల శ్రీనివాస్, నాగిరెడ్డి మధుసూదన్రెడ్డి నాయకత్వంలో జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాలకు చెందిన సుమారు 300 మంది యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటింది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు.