హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందే ఎర్లీ బర్డ్ స్కీం గడువును మున్సిపల్ శాఖ ఈనెలాఖరు వరకు పొడిగించింది. ఏప్రిల్ 30తో స్కీం గడువు ముగిసినా, కరోనా నేపథ్యంలో మరికొంత గడువు ఇవ్వాలని సీడీఏంఎ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మున్సిపల్శాఖకు లేఖ రాయడంతో గడువును పొడిగిస్తూ శనివారం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మే 31 వరకు ఎర్లీ బర్డ్ స్కీం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీలో అమల్లో ఉంటుంది.