హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల న్యాయవాదులకు ఈ-పాస్లు కేటాయించాలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. జూన్ 1లోగా ఈ నిర్ణయంపై ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని ప్రత్యేక జీపీని ఆదేశించింది. లాక్డౌన్ నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చే న్యాయవాదులను తెలంగాణలో అడ్డుకోవద్దని న్యాయవాది కిశోర్బాబు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రాష్ట్రాల్లో కేసులు వాదించే లాయర్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు లాయర్లకు ఈ-పాస్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా అభిప్రాయపడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.