హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. బైక్లు, ఆటోలను పాస్ లేకుండా వస్తే అనుమతిని నిరాకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ఈపాస్ లేకుండా వచ్చిన వారికి వెనక్కి పంపిస్తున్నారు. మరోసారి వస్తే.. వాహనం సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.