హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల ఏరియా దవాఖానలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ-ఐసీయూ ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘నిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ-ఐసీయూ హబ్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పేందుకు సంతోషంగా ఉన్నది. వర్చువల్ గైడెన్స్ ద్వారా నెల వ్యవధిలో 40 ఎమర్జెన్సీ కేసులను ట్రీట్మెంట్ చేశారు. సూపర్ స్పెషలిస్టులు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు క్రిటికల్ కండిషన్లో ఉన్న ఏడుగురిని కాపాడారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో మరో 16 గ్రామీణ దవాఖానలకు దీన్ని అనుసంధానించాలని నిర్ణయించాం. సూపర్ స్పెషలిస్టులు.. స్థానిక వైద్యులకు సలహాలు, సూ చనలు ఇస్తారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కమిషనర్ కరుణ అండ్ టీమ్కు అభినందనలు తెలుపుతున్నా’ అని మం త్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు.