తిరుపతి, జూన్ 17: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రేపు పుష్పయాగం జరుగనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.