చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్ 27: చేనేతకు ప్రసిద్ధిగాంచిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండ లం కొయ్యలగూడెం మరోసారి జాతీయస్థాయి ఖ్యాతిని గడించింది. ప్రకృతి రంగులతో అద్భుత ప్రతిభ కనబర్చినందుకు ఆ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు దుద్యాల శంకర్ మెరిట్ సర్టిఫికెట్కు ఎంపికయ్యారు. ఢిల్లీలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయ న ఈ సర్టిఫికెట్ అందుకోనున్నారు. జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన చేనేత కళాకారులకు చేనేత, జౌళి మంత్రిత్వశాఖ ఈ సర్టిఫికెట్ ప్రదానం చేస్తున్నది. దీనికోసం 2019లో దేశావ్యాప్తంగా నేత కళాకారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రకృతి రంగులు అద్దిన టై అండ్ డై పద్ధతిలో డైమండ్ డిజైన్లో మగ్గంపై శంకర్ నేసిన సింగిల్ ఇక్కత్ పట్టుచీరను ఈ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిని రాష్ట్ర, ప్రాం తీయ స్థాయిలో పరిశీలించారు. అనంతరం జాతీయస్థాయి పోటీకి పంపించగా, దీనికి జాతీయ మెరిట్ సర్టిఫికెట్ దక్కింది. దేశవ్యాప్తంగా 10 మందిని దీనికి ఎంపికచేశారు. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి అవకాశం వచ్చింది శంకర్ ఒక్కడికే. ఆయన సేవలకు గతేడాది కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర చేనేత పురస్కారం కూడా లభించింది. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కొలను పెద్ద వెంకయ్య ఆయన కుమారుడు రవీందర్ సహజసిద్ధమైన ప్రకృతి రంగులు వాడి పదినెలలు కష్టపడి మగ్గంపై నేసిన తేలియా చీర 2018 హస్తకళల పురస్కారానికి ఎంపికైంది. వేసవికాలంలో చల్లదనం, శీతాకాలంలో వెచ్చదనం ఈ చీర ప్రత్యేకత. 60 ఏండ్లుగా చేనేత పనిచేస్తున్న తమకు ఇన్నాళ్లకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.