కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. రోజుకు కొన్ని వేల మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల కొద్ది కేసులు నమోదు అవుతున్నాయి. పరిస్థితులని చూసి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. కాని కొందరు మాత్రం కనీసం మాస్క్లు కూడా పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ద్వారా పరిస్థితులని అర్దం చేసుకొని కరోనా జాగ్రత్తలు పాటించండని విజ్ఞప్తి చేసింది.
దేశంలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దు. తప్పని సరిగా అందరూ మాస్కులు ధరించాలి. మీ కోసం, మీ ఫ్యామిలీ కోసం, స్నేహితుల కోసం, ఫ్రంట్ టైన్ వారియర్స్ కోసం అందరు ఇంట్లోనే ఉండండి. అత్యవరసరం అయితే తప్ప అడుగు బయట పెట్టొద్దు. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మీ వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోండి. మనం తీసుకునే కొన్ని జాగ్రత్తలు వైద్యరంగంపై ఒత్తిడి తగ్గిస్తాయి అని ప్రియాంక తన పోస్ట్లో పేర్కొంది. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్’ అనే అమెజాన్ సిరీస్తో పాటు ‘మ్యాట్రిక్స్ 4’లోనూ నటిస్తోంది.