చెన్నై: హోటల్లో ఫుడ్ సర్వ్ చేయడంలో ఆలస్యంపై ఆగ్రహించిన ఇద్దరు యజమానిపై దాడి చేసి కత్తితో అతడి చెవిని కోశారు. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన జరిగింది. అరుణ్కుమార్, శివ అనే ఇద్దరు సినిమా చూసేందుకు వెలిపాలయంలోని థియేటర్కు వెళ్లారు. సినిమా మొదలు కావడానికి సమయం ఉండటంతో ఏదైనా తినేందుకు సమీపంలోని హోటల్కు వెళ్లారు. టిఫిన్కు ఆర్డర్ ఇవ్వగా సర్వర్ పక్క టేబుల్ వారికి సర్వ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాగ్వాదం ముదరడంతో ఆ ఇద్దరు హోటల్ యజమానిపై దాడి చేశారు. అంతటితో ఆగక కత్తితో అతడి చెవి కోశారు. రక్తం కారడంతో వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా అరుణ్, శివను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు రౌడీలని, వారిపై ఇతర కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.