హైదరాబాద్: ఎంసీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. తాజాగా ఈకార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ (డీటీసీ) కే పాపారావు పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కొండాపూర్లోని ఆర్టీఓ కార్యాలయంలో మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి విజయవంతంగా ముందుకు తీసుకువెళుతున్న ఎంపీ సంతోష్ కుమార్ను అభినందించారు.