ఢిల్లీ, జూన్18: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్నిరంగాల్లో ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అటువంటి సమయంలోను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) అత్యధిక టర్నోవర్ను నమోదు చేసింది. 2020-21 సంవత్సరంలో కెవిఐసి స్థూల వార్షిక టర్నోవర్ రూ. 95,741.74 కోట్లు ఉండగా. 2019-20లో అది రూ.88,887 కోట్ల టర్నోవర్ ఉన్నది. ఈ ఏడాది 7.71శాతం పెరుగుదల నమోదైంది. గతేడాది మార్చి 25 న ప్రకటించిన దేశవ్యాప్త లాక్డౌన్ సందర్భంగా మూడు నెలలకు పైగా ఉత్పత్తి కార్యకలాపాలు నిలిపివేసినా 2020-21లో కెవిఐసి రికార్డ్ పనితీరు ప్రాముఖ్యతను సంతరించుకున్నది.
2015-16 సంవత్సరంతో పోల్చితే 2020-21లో ఖాదీ, గ్రామ పరిశ్రమ రంగాలలో మొత్తం ఉత్పత్తి 101శాతం వృద్ధిని నమోదు చేయగా, ఈ కాలంలో స్థూల అమ్మకాలు 128.66శాతం పెరిగాయి. కొత్త పిఎమ్ఇజిపి యూనిట్ల ఏర్పాటు, కొత్త ఎస్ఎఫ్యుఆర్టి క్లస్టర్లు, ప్రభుత్వ చేపట్టిన “స్వదేశీ” వంటి కార్యక్రమాలు, సదుపాయాల సరఫరా కోసం పారామిలిటరీ దళాలతో కెవిఐసి చారిత్రాత్మక ఒప్పందాలు మహమ్మారి సమయంలో కేవీఐసీ టర్నోవర్ను పెంచాయి.