నర్సంపేట రూరల్, మే 10 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్వర సర్వే సోమవారం మండలంలో చురుగ్గా కొనసాగింది. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది గ్రామాల్లోని జ్వర పీడితుల వివరాలను నమోదు చేసుకున్నారు. మందుల పంపిణీ చేపట్టారు. గురిజాల, చంద్రయ్యపల్లి, చిన్న గురిజాల, జీజీఆర్ పల్లి, పాతముగ్ధుంపురం, లక్నేపల్లి, మర్రినర్సయ్యపల్లి, రామవరం భోజ్యానాయక్తండా, ఆకులతండా, నర్సింగాపురం గ్రామాల్లో వివరాలు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు గొడిశాల మమత, లావణ్య, సుజాత, కోమల, రాంబాబు, కొడారి రవన్న, లలిత, రాము తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట : నర్సంపేటలోని పలు వార్డుల్లో జ్వర సర్వే నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉం టే ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దని వైద్య అధికారులు కోరారు. ఎక్కువ రోజులు వేచి ఉండడం వల్ల వైరస్ బలపడి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు 360 మందికి జ్వరం ఉన్న ట్లు గుర్తించామన్నారు.
వర్ధన్నపేట : గ్రామాలు, పట్టణాలకు దూరంగా ఉన్న గిరిజనులకు వైద్య సిబ్బంది కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికైనా జ్వరం, జలుబు తదితర ఇబ్బందులు ఉన్నట్లయితే గ్రామ ప్రజాప్రతినిధులు, ఆశ వర్కర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీతండా, చంద్రుతండా సర్పంచ్లు గుగులోత్ లక్ష్మి, గుగులోత్ స్వరూప, ఏఎన్ఎం దేవయాని తదితరులు పాల్గొన్నారు.