‘మనం’ అనంతరం హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలోని మిలన్లో జరుగుతోంది. నాగచైతన్య, రాశీఖన్నాలపై ప్రేమ సన్నివేశాలతో పాటు పాటల్ని చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ప్రారంభమైన ఈ షెడ్యూల్ మే ప్రథమార్థం వరకు సాగనున్నట్లు తెలిసింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణను జరుపుతున్నట్లు చెబుతున్నారు. భిన్న కాలాల్లో సాగే ఈ ప్రేమకథలో నాగచైతన్య పాత్రచిత్రణ డిఫరెంట్ షేడ్స్తో ఉంటుందని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.