హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివార్లలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ వినియోగంపై వస్తున్న వార్తలపై హైకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. డ్రగ్స్ సరఫరా విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడన ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్రంలో 2016లో డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయని, వీటినీ సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిల్ను విచారించిన ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.