షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
కొత్తూరు రూరల్, మార్చి 19: త్వరలో జరుగనున్న కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కొత్తూరు మండలకేంద్రంలో శుక్రవారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి ఆధ్వర్యంలో మున్సిపాలిటి పరిధిలోని కుమ్మరిగూడ, తిమ్మాపూర్, అక్కివాణిగూడ, కొత్తూరు, కొత్తూరు తండా , ఫాతిమాపూర్ గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్యకార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త కృషిచేయాలన్నారు. అలాగే పార్టీ సభ్యత్వాలను త్వరగా పూర్తిచేయాలన్నారు. సభ్యత్వాలను వెంటనే ఆన్లైన్లో నమోదుచేయాలన్నారు. ఆన్లైన్లో నమోదు చేయించకపోతే రూ. 2లక్షల విలువైన బీమాను కార్యకర్త లు నష్టపోయే అవకాశముందన్నారు. కావున సభ్యత్వం తర్వాత తప్పకుం డా ఆన్లైన్లో నమోదు చేయించాలన్నారు. సమావేశంలో మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ దేవేందర్యాదవ్, మాజీ సర్పంచ్లు జనార్దన్రెడ్డి, కోస్గీ శ్రీను, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, సదానందంగౌడ్, క్రాంతిరెడ్డి, జనార్దన్చారి, మెండె కృష్ణయ్య, రాఘవేందర్యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తూరు మాజీ ఎంపీటీసీ బ్యాగరి యాదయ్య, కాంగ్రెస్నాయకులు సామెలు, గోపాల్గౌడ్, వెంకటయ్య, పాపయ్య, కృష్ణయ్య, బాలకిష్టయ్య, సుమన్, సురేందర్, డేవిడ్రాజ్, నాగేశ్ టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యుల పరామర్శ
కొందుర్గు, మార్చి 19: కొందుర్గు మండలంలోని చెర్కుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నర్సింహులు గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వ దవా ఖనాలో కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. నర్సింహులు పార్టీకీ ఎనలేని సేవ చేశారన్నారు. నర్సింహులు కుటుంబ సభ్యులకు పార్టీ అండ ఎల్లప్పుడు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, నరేందర్ ఉన్నారు.