హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభు త్వం పెద్ద ఎత్తున ఐఏఎస్లను బదిలీచేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కామారెడ్డి కలెక్టర్గా ఉన్న ఏ శరత్ను పంచాయతీరాజ్ కమిషనర్గా నియమించింది. ఎం రఘునందన్రావును వ్యవసాయశాఖ కార్యదర్శిగా నియమించింది. వెయిటింగ్లో ఉన్న అనితా రామచంద్రన్ను టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా, వీ వెంకటేశ్వర్లును యువజన సర్వీసుల సంచాలకుడిగా, మహ్మద్ అబ్దుల్ అజీమ్ను మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూ టీ సెక్రటరీగా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్ను పరిశ్రమలశాఖ సంచాలకుడిగా బదిలీచేసింది. పలువురు మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్లుగా నియమించింది.