హుస్నాబాద్, ఏప్రిల్ 30 : హుస్నాబాద్ ఉమ్మడి మండలంలో ధాన్యం కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 27 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఇప్పటి వరకు 1,130 మంది రైతుల నుంచి 1,26,166 బస్తాలు, 50,840 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. హుస్నాబాద్ మండలంలో హుస్నాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన 14 కొనుగోలు కేంద్రాల్లో 543 మంది రైతుల నుంచి 62,319 బస్తాలు, 24,576 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. అక్కన్నపేట మండలంలో ఏర్పాటు చేసిన 13 కొనుగోలు కేంద్రాల్లో 587 మంది రైతుల నుంచి 63,847 బస్తాలు, 26,264 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఆయా కేంద్రాల్లో రైతులకు అవసరమైన సౌరర్యాలతో పాటు గన్నీ బ్యాగులు, ఎలక్ట్రానిక్ కాంటాలను అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. హుస్నాబాద్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి పెద్ద ఎత్తున ధాన్యం తరలివస్తోంది. అందుకనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.