ఆసిఫాబాద్ : జిల్లా పరిధిలోని పెంచికల్పేట్ మండలం లోడ్పల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ పులి బీభత్సం సృష్టించింది. మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసింది. ఈ దాడిలో మూడు పశువులు మృతి చెందాయి. పశువుల కాపర్లు ఈ విషయాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న గ్రామస్తులు.. పులి సంచారంపై నిఘా పెట్టారు. అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు.