ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం ట్రేడింగ్ తొలిరోజే లాభాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూల ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చాయి. ఉదయం 9:30 గంటలకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 370 పాయింట్లు లాభపడి 49,576 వద్ద ట్రేడవుతున్నది. బజాజ్ హింద్, హింద్ కాపర్, ట్రైడెండ్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం తొలిరోజు లాభాల జోరుతో మొదలైంది. ఉదయం 9.30 గంటల వరకు నిఫ్టి 120 పాయింట్ల లాభంతో 14,941 వద్ద ట్రేడవుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్