Realme X7 Max 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ మరో సరికొత్త 5G స్మార్ట్ఫోన్ను భారత్లో ఆవిష్కరించింది. రియల్మీ ఎక్స్7 మాక్స్ 5జీ పేరుతో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. 5జీని సపోర్ట్ చేసే మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్సెట్ను కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్ఫోన్ ఇదే.
ఈ ఫోన్ ఆస్టరాయిడ్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్, మిల్కీ వే కలర్లలో లభించనుంది. కొత్త ఫోన్ జూన్ 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్మీ అఫీషియల్ స్టోర్తో పాటు ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.
కొత్త ఫోన్ 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+సూపర్అమోలెడ్ స్క్రీన్తో వస్తోంది. హెచ్డీఆర్ వీడియోలను సపోర్ట్ చేస్తుంది. 4500mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.26,999గా నిర్ణయించారు. 12జీబీ ర్యామ్+ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. రియల్ అప్గ్రేడ్ ప్రొగ్రామ్లో భాగంగా రియల్మీ ఎక్స్7మాక్స్ 5జీ స్మార్ట్ఫోన్లకు కేవలం 70శాతమే చెల్లించొచ్చని పేర్కొంది.
8GB ర్యామ్+128GB స్టోరేజ్ ధర రూ. 18,899
12GB ర్యామ్+256GB స్టోరేజ్ ధర రూ. 20,999