న్యూఢిల్లీ : భారతీయులలో మద్యపానం, థైరాయిడ్ సమస్యలు గత సంవత్సరంలో తగ్గినట్లు కనిపించాయి. అయితే, చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఫిట్నెస్, ఆరోగ్యం విషయాల పట్ల దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగినప్పటికీ, రక్తపోటు, కొలెస్ట్రాల్. డయాబెటిస్ స్థాయిల పెరుగుదల సమస్యలు అధికమవుతున్నాయని తాజా ఆరోగ్య నివేదిక వివరించింది.
హెల్త్ రిస్క్ అసెస్మెంట్ (హెచ్ఆర్ఏ) స్కోరు ప్రకారం.. ప్రతి ఇద్దరుభారతీయుల్లో ఒక్కరు ‘హై రిస్క్’ లేదా ‘బోర్డర్లైన్’ విభాగంలో ఉన్నారు. ఇది గత ఏడాది గణాంకాల నుంచి 12 శాతం భారీ మెరుగుదల కనిపించింది. ఇక్కడ 62 శాతం మంది భారతీయులు ‘అనారోగ్య’ విభాగంలోకి వచ్చారు. జీఓక్యూఐఐ తాజా ఇండియా ఫిట్ రిపోర్ట్ 2021 ప్రకారం, ప్రజల జీవనశైలిలో కొన్ని సర్దుబాట్లు చేయడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్యంగా మారవచ్చు. ప్రయాణ సమయం, లాక్డౌన్ విధింపు బహుశా భారతీయులు తమ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అనుకూలించింది. లింగ కోణం నుంచి చూస్తే స్త్రీలతో పోలిస్తే పురుషులు ఆరోగ్యంగా ఉన్నారు. వయస్సు దృక్పథంలో పాత తరంతో పోల్చితే యువ తరం అనారోగ్యంగా ఉంటున్నట్లు తేలింది.
రెండేండ్ల క్రితం 13.4 శాతంతో పోల్చితే 2020 లో 15 శాతం మంది వినియోగదారులు అధిక రక్తపోటును కలిగి ఉన్నట్లుగా తేలింది. ఈ సంఖ్య గత నాలుగేండ్లలో క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ ఆరోగ్య సమస్య కుటుంబంలో 35 శాతం మంది ఉన్నట్లు తేలింది. వృద్ధులలో రక్తపోటు కేసులు పెద్దవారిలో మూడు రెట్లు ఎక్కువగా ఉన్నది. 45 ఏండ్ల వయసు పైబడిన వారికి రక్తపోటు వచ్చే ప్రమాదం ఉన్నది.
డయాబెటిస్ కేర్ అండ్ మేనేజ్మెంట్ కోసం పూర్తి-స్టాక్ డిజిటల్ ఎకోసిస్టమ్ నిర్వహించిన విశ్లేషణలో.. జనవరి-ఫిబ్రవరి మధ్యకాలం వరకు సగటు కరోనా మహమ్మారి ఉపవాసం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు 138 ఎంజీ / డీఎల్ గా ఉండగా.. మార్చి-ఏప్రిల్ మధ్య వరకు ఇది 165 ఎంజీ / డీఎల్ కు పెరిగింది. ఈ వ్యాధి తమ కుటుంబంలో ఉన్నదని మూడో వంతు ప్రజలు చెప్తున్నారు. డయాబెటిస్తో బాధపడుతున్న వారి శాతం పెద్దల నుంచి వృద్ధుల వరకు మూడు రెట్లు పెరుగడం గమనార్హం.
13 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ను నివేదించారు. ఇది గత రెండేండ్లుగా స్థిరంగా ఉన్నది. మరోవైపు, 4 శాతం మంది మాత్రమే తమకు గుండె సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది 2019 లో 8.6 శాతం నుంచి పెద్ద తగ్గుదలగా చెప్పుకోవచ్చు.
దాదాపు అన్ని వయసుల వారికి, అలాగే మెజారిటీ నగరాల్లో మద్యపానం కేసుల సంఖ్య తగ్గిపోయాయి. కొవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రారంభించడమే అతిపెద్ద కారణంగా చెప్పుకోవచ్చు. ప్రయాణం పరిమితం కావడంతోపాటు కేఫ్లు, రెస్టారెంట్లు, బార్లు వంటివి మూసివేయడం మరోకారణంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ప్రజల మద్యపానాన్ని తగ్గించాయి. కొంత మంది ఇంట్లోనే మద్యం తీసుకోగా.. చాలా మందికి అది సాధ్యపడలేదు. మెజారిటీ ప్రజలకు కుటుంబసభ్యుల మధ్య మద్యపానం అంత సౌకర్యంగా లేదని చెప్పవచ్చు. ఫలితంగా ఈ ఏడాది మద్యం తీసుకునే మొత్తం తగ్గిపోయింది.
గత సంవత్సరం డాటాతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రతి వయస్సు విభాగంలో అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహార ఎంపికల ద్వారా రోగనిరోధక శక్తి స్థాయిలకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెరగడం దీనికి ఒక కారణం కావచ్చు. దేశవ్యాప్తంగా కాలుష్య స్థాయిలు తగ్గడం కూడా దీనికి మరో కారణంగా చెప్పుకోవచ్చు.
ఏడాది పొడవునా ఒత్తిడి స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. సర్వే ఫలితం ఒత్తిడి సూచిక మధ్య సంవత్సరంలో 4.98 నుంచి సంవత్సరం చివరిలో 5.11 కు పెరిగింది. ప్రస్తుతం 45 శాతం మంది నిరాశతో బాధపడుతున్నారు. నగరాల వారీగా సూరత్, జైపూర్, పాట్నా వరుసగా భారతదేశంలో ఆరోగ్యకరమైన మొదటి మూడు నగరాలుగా నిలిచినట్లు ఈ సర్వే వెల్లడించింది.