హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్)-2021 రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల గడువు తేదీని పెంచినట్టు కాలేజీ విద్య కమిషనర్ నవీన్మిట్టల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటిదశ వెబ్ ఆప్షన్లు ఈ నెల 24 వరకు ఇవ్వొచ్చని, 31న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్కు ఆగస్టు 1 నుంచి ఐదు వరకు గడువు ఉంటుందని వెల్లడించారు. రెండోదశ రిజిస్ట్రేషన్లు ఆగస్టు ఒకటినుంచి 9 వరకు చేసుకోవచ్చని, రెండునుంచి 9వ తేదీవరకు వెబ్ఆప్షన్లు ఇవ్వొచ్చని ఆయన వివరించారు. వికలాంగులు, సీఏపీ, ఎన్సీసీ తదితర ప్రత్యేక క్యాటగిరీ అభ్యర్థుల పరిశీలన ఆగస్టు 6న ఉంటుందని, 14న సీట్లు కేటాయిస్తామన్నారు.