శ్రీకాకుళం: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అంటే ప్రజలకు ఇప్పుడు ఏమాత్రం భయం లేకుండా పోయింది. ఆ అదే వస్తుంది, పోతుందిలే అని ఆ మహమ్మారి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. గత ఏడాది ఫస్ట్ వేవ్ సందర్బంగా పాజిటివ్ వచ్చిందని తెలియగానే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్న వాళ్లే.. ఇప్పుడు సెకండ్ వేవ్లో కరోనా గురించి కామెడీలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా దాదాపుగా రోజుకు వెయ్యిమంది చొప్పున కరోనా బారినపడి చనిపోతున్నా ప్రజల్లో ఇంత నిరక్ష్యం గూడుకట్టుకుని ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఘటనే ప్రజల్లో కరోనాపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పాత జాతీయ రహదారిలో ఉన్న ఓ పకోడి షాపు యజమాని ఇటీవల కరోనా టెస్టు చేయించుకున్నారు.
అయితే, ఆయనకు పాజిటివ్గా తేలడంతో మెడికల్ సిబ్బంది ఫోన్ చేసి విషయం చెప్పారు. కుటుంబసభ్యులను కూడా తీసుకొచ్చి పరీక్షలు చేయించాలని, అనంతరం కుటుంబం అంతా హోంక్వారెంటైన్లో ఉండాలని సూచించారు. దాంతో పకోడి షాపు యజమాని.. పకోడి కోసం చేసిన పిండి రుబ్బు కొంచెం ఉన్నదమ్మా దాంతో పకోడిలు వేశాక వస్తాంలే అని చెప్పాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మెడికల్ సిబ్బంది అతనికి చివాట్లు పెట్టి వెంటనే 108 వాహనాన్ని పంపించి బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం..!
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
దారితప్పి బావిలోపడ్డ ఏనుగుపిల్ల.. రక్షించిన అధికారులు.. వీడియో
ఇరాన్ అణు కేంద్రంపై సైబర్ దాడి !
కాబోయే భర్త రమ్మన్నాడు.. ఆ తర్వాత హత్య
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్