హుజూరాబాద్ టౌన్, మే 20: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపు మేరకు గురువారం సిద్దిపేటలో ఆయనతో భేటీ అయినట్టు హుజూరాబాద్కు చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రభుత్వ అనుసంధాన మాజీ అధికారి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దొంత రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో తాజా రాజకీయ, కార్యకర్తల అభిప్రాయాలు, వివిధ అభివృద్ధి, పెండింగ్ పనుల గురించి మంత్రి హరీశ్రావు తనను అడిగి తెలుసుకున్నట్టు రమేశ్ వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ కోసం పని చేయాలని సూచించారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారని తెలిపారు. మంత్రి హరీశ్రావును కలిసినవారిలో టీఆర్ఎస్ నాయకులు సందమల్ల బాబు, దొమ్మాటి వెంకన్న, దుబాసి బాబు, ముక్క శ్రీనివాస్, తిరుపతి తదితరులు ఉన్నారు.