జనగామ : రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు చేస్తున్న కృషితో రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారి పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో ఆదివారం మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికి జ్వర సర్వే నిర్వహిస్తూ, మెడికల్ కిట్లు అందించే కార్యక్రమం రాష్ట్రంలో సత్ఫలితాలు ఇస్తున్నదని ఆయన తెలిపారు.
కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లయితే డాక్టర్ల పర్యవేక్షణలో హోమ్ ఐసులేషన్ లో ఉండి చికిత్స పొందాలని ఆయన సూచించారు. సీవియర్ లక్షణాలు ఉన్న రోగులను వైద్య చికిత్స కోసం జనగామలోని ప్రభుత్వ దవాఖానలో గాని వరంగల్ ఎం.జి.ఎం.లో గాని చేర్పించాలని ఆయన సూచించారు.
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో ఆప్తులను, కార్యకర్తలను కోల్పోవడంతో హృదయం కన్నీటి సంద్రమవుతున్నదని మంత్రి అన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు సైతం కరోనాతో మృత్యు వాతపడటం అత్యంత విషాదకరమన్నారు.
కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి ప్రజాప్రతినిధులు అండగా నిలవాలన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడిన దొంగ అరెస్ట్
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
గుడ్న్యూస్.. రేపే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!