పట్నా: లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకుడు, దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ను ఎల్జేపీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించారు. చిరాగ్ పాశ్వాన్ చిన్నాన్న, ఎంపీ పశుపతి పరాస్ తిరుగుబాటుతో ఇప్పటికే చిరాగ్ పార్టీ లోక్సభాపక్ష నేత పదవిని కోల్పోయారు. పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు లోక్సభలో తమ నాయకుడిగా పరాస్ను ఎన్నుకున్నట్లు ఆదివారం రాత్రి స్పీకర్ ఓం బిర్లాను కలసి తెలియజేశారు. దాంతో, పరాస్ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ క్రమంలో మంగళవారం అత్యవసరంగా సమావేశమైన పరాస్ బృందం.. పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా చిరాగ్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పరాస్.. ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్లమెంటరీ బోర్డు చైర్మన్గా, జాతీయాధ్యక్షుడిగా ఉంటారని స్పష్టంచేసింది. ఎల్జేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సూరజ్భాన్ సింగ్ ఉంటారని పేర్కొన్నది. ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో అధికార మార్పిడి జరిగి పశుపతి కుమార్ పరాస్ చేతికి పార్టీ పగ్గాలు రానున్నాయి.