హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): నిరసన తెలపడం చాలా ముఖ్యం. కానీ, బాధ్యతను విస్మరించవద్ద్దని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం కొందరు గ్యాస్ సిలిండర్, ద్విచక్రవాహనాన్ని ట్యాంక్బండ్లో విసిరేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ మంగళవారం ట్విట్టర్లో స్పందించారు. ‘ప్రభుత్వాల, ప్రజల దృష్టిలో పడటానికి ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడమనేది చాలా ముఖ్యం. కానీ ఇలా బైక్లు, సిలిండర్లను సరస్సుల్లోకి విసిరేసే బాధ్యతారహితమైన ప్రవర్తన ఖండించదగినది. ఈ చర్యలకు పాల్పడినవారిపై హోంమంత్రి, డీజీపీ కఠినచర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు. ట్వీట్పై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. వీరిపై చట్టప్రకారం డీజీపీ చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.