ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని జిల్లా సీహెచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ వేళ అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారుల వాహనాలను సీజ్ చేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం మా లక్ష్యం కాదని, ప్రజలు కరోనా వ్యాధికి గురికాకుండా కుటుంబంతో సంతోషంగా వుండాలనదే పోలీసుల ఉద్దేశమన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జిల్లా పోలీసులు కేసులు నమోదు చేయడం, జరిమానాలు విధిస్తారన్నారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ఈ రోజు వరకు చేపట్టిన తనిఖీలలో మాస్కులు ధరించకుండా బయట తిరిగిన 961 మందిపై కేసులు నమోదు చేసి రూ. 9,61,000 జరిమానాగా విధించామన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనుమతించిన సమయం తర్వాత బయట తిరుగుతున్న 1268 వాహనాలను సీజ్ చేసినట్లు వివరాలను వెల్లడించారు.
ప్రజలందరూ అనుమతించిన సమయంలో కూడా తప్పనిసరిగా మాస్కులను ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం